కోనసీమ: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో రూ.20.73 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, సీసీ రోడ్లను ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు.