టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో పోప్ (106) సెంచరీతో మెరిశాడు. బ్రూక్ (99) ఒక్క పరుగుతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నారు.