KDP: అట్లూరు మండలంలోని కంబగిరి సమీపంలో బాల్ రెడ్డి పల్లె వద్ద పశువుల దాహార్తి తీర్చడం కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ తొట్టికి పైపులైన్ కనెక్షన్ లేకపోవడంతో వృధాగా ఉండిపోయింది. పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు స్పందించి నీటి వసతిని కల్పించాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు.