AP: YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. దళిత JAC నేత కంభంపాటి శిరీష ఫిర్యాదుతో తాడేపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. మహిళలపై సజ్జల అసభ్య వ్యాఖ్యలు చేశారని శిరీష ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని లాయర్ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.