KDP: సిద్ధవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ రేణుక యల్లమాంబకు ఆదివారం విశేష పూజలు జరిగాయి.ఈ సందర్భంగా.. ఆలయ అర్చకుడు సుబ్బరాజు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకం,పలు అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. పరిసర గ్రామాల మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించిన అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.