GNTR: వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు గుంటూరులో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జీఎంసీ అప్రమత్తమైంది. ప్రజల ఫిర్యాదుల కోసం 0863-2345103నంబర్తో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 24 గంటలు సిబ్బంది విధుల్లో ఉంటారని, నీటి నిల్వలు, చెట్లు విరిగిన సమస్యలపై వెంటనే స్పందిస్తామని కమిషనర్ శ్రీనివాసులు గురువారం తెలిపారు. విద్యుత్ అంతరాయం కోసం జనరేటర్లు సిద్ధం చేశారు.