SKLM: మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి రెసిడెన్షియల్ బాలబాలికల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాల్లో టెక్కలి విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో ఏడుగురు విద్యార్థులు సీట్లు సాధించారు. రట్టి రాంసాయి చరణ్, మామిడి సాకేత్, దండాసి ప్రవీణ్, యర్ర మోక్షిత్, దేవాది చైత్ర, జోగి జ్యోతిర్మయి, దాసరి రేష్మ సీట్లు పొందారు.