SKLM: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని ఆయుష్ వైద్యులు డా. పి. జగదీష్ వెల్లడించారు. యోగా ప్రతి ఒక్కరూ చేయవచ్చన్నారు. ఆదివారం 80 అడుగుల రహదారిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా పట్ల అందరూ అవగాహన పెంచుకొని యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చని చెప్పారు.