మార్కాపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు చేతికి ఉన్న బంగారు గాజులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.