NRML: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.