BDK: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు 43 అడుగులకు ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకి 44.4 అడుగులకు చేరింది. కాగా, 43 అడుగుల వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.