కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పలివెల గ్రామంకి చెందిన కళ్యాణపు హృషిత హర్షిని, వారి కుటుంబ సభ్యులు శనివారం విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్నకు విరాళంగా రూ.18,906 విరాళం అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రములతో సత్కరించి, వారికి స్వామి వారి చిత్రపటం అందజేశారు.