AP: వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఏడాది మిర్చి అత్యధిక ధర పలుకుతోందని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డును తరలించాలని ప్రతిపాదనలు ఉన్నాయని.. ఆధునిక యార్డు నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అలాగే, గత పాలకులు మిర్చి యార్డును అవినీతికి నిలయంగా మార్చారని ఆరోపించారు. రైతు పరామర్శ పేరుతో యార్డుకు వచ్చి నానాయాగి చేశారని విమర్శించారు.