JGL: కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామశివారులో ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు గ్రామస్థులు గురువారం గుర్తించారు. మృతుడికి 30 ఏళ్ళు ఉంటాయన్నారు. బావి ఒడ్డు పై అంగీ, చెప్పులు ఉండగా.. మృతుడి ఒంటిపై పాయింట్ ఉంది. ఇది హత్యనా.. లేక ఆత్మహత్యనా తెలియాల్సి ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.