ప్రకాశం: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్ ఏర్పాటు చేయాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లోని అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల ఫిర్యాదులను విని వాటికి పరిష్కార మార్గం చూపాలని ఆయన ఆదేశించారు.