HYD: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఇందిరా నగర్కు చెందిన షాబాజ్ (23) అనే వ్యక్తిపై దుండగులు కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.