కృష్ణా: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో విద్యార్థులు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు రోడ్డు ప్రమాదాల పట్ల ఎలా అవగాహన కలిగి ఉండాలి, ఇతరులకు ఏ విధంగా సహాయపడాలని అనే అంశాలను ప్రదర్శన రూపంలో ప్రజలకు తెలిపారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనకు ప్రజలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.