SKLM: రథసప్తమి సందర్భంగా భక్తులకు రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోనే మంగళవారం ఓ వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సరోజిని తక్షణమే స్పందించారు. ఆమెకు సపర్యలు చేసి ఆలయ ప్రాంగణంలోని వైద్య శిబిరంలో చికిత్స చేయించారు.