SKLM: నందిగం మండలం బడబంధ, కోటిపల్లి, కోటియా కొండపేట, బంజీరుపేట గ్రామాల రహదారి సమస్యలపై మంగళవారం నందిగం జనసేన పార్టీ అధ్యక్షుడు తాడేల చిరంజీవి, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్లో మంత్రిని కలిసిన ఆయన… రహదారి సమస్యలను వివరించి పరిష్కరించాలని మంత్రిని కోరారు.