KDP: కడప ప్రధాన కూడలిలో హిందూ, ముస్లిం మత నమూనాలు ఏర్పాటు చేసి, క్రైస్తవ నమూనా మరిచారని ఆ మతానికి చెందిన సభ్యులు ఎం. ప్రసాద్, సిహెచ్ విజయ్ బాబు అన్నారు. సోమవారం కడప కమిషనర్కు గ్రీవెన్స్లో అర్జీ ద్వారా విజ్ఞప్తి చేశారు. అన్ని మతాలను సమానంగా చూడాలని కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.