ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఫిబ్రవరి 5న జరిగే పోలింగ్ పైనే ప్రధాన పార్టీలు బలమైన ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తమ పార్టీ గెలిచే స్థానాలను అంచనా వేశారు. 70 అసెంబ్లీ స్థానాల్లో ‘ఆప్’ 55 స్థానాల వరకూ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. మహిళలు తమ భర్తలను ఒప్పించినట్లయితే 60 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు.