ELR: ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అహంకారపూరితంగా ప్రజా గళాన్ని అణచివేసిందని మండిపడ్డారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి గండికొట్టిందని విమర్శించారు.