ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 54 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.