SKLM: రథసప్తమి వేడుకలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అరసవిల్లిలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా నేటి రాత్రి నుంచి శ్రీ అరసవిల్లిలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.