AP: రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ నాలుగు అంబులెన్సులు ఇచ్చారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ తరఫున ఇచ్చిన అంబులెన్సులను చంద్రబాబు ప్రారంభించి ఆయనను అభినందించారు. కరోనా సమయం నుంచి అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ సోనూసూద్ గొప్ప మనసు చాటుకుంటున్నారని పేర్కొన్నారు.