సత్యసాయి: సోమందేపల్లి మండలంలో నూతన ఆర్టీసీ బస్టాండుకు మోక్షం కలిగేలా లేదు. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర మంత్రి దివంగత పరిటాల రవీంద్ర ఈ బస్టాండుని ప్రారంభించారు. అయితే అప్పటి నుండి ప్రభుత్వాలు మారాయి కాని నేటికి ఈ బస్టాండు వాడుకలోకి రాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 23న ఆర్టీసీ అధికారులు ఈ బస్టాండుకి రంగులు వేసి వదిలేశారు.