ELR: గణపవరం గ్రామ దేవత దండు మారెమ్మ అమ్మవారిని ఆదివారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు దర్శించుకుని పూజలు చేశారు. జరగబోయే జాతర మహోత్సవాలకు జనసేన నాయకులు లక్ష రూపాయలు విరాళాన్ని ఎమ్మెల్యే ధర్మరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.