ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్ చీఫ్ కేజ్రీవాల్ రాష్ర ప్రజలకు సూచనలు చేశారు. ‘ఉచ్చులో పడకండి, డబ్బు తీసుకోండి కానీ వారికి ఓటు వేయకండి. జుగ్గి(మురికివాడ) నివాసితులను రూ.3 వేల పథకం, ఎన్నికల కమిషన్ ద్వారా ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హామీతో బీజేపీ తప్పుదారి పట్టిస్తోంది. ఇంటింటికీ వెళ్లి బీజేపీ వాళ్లు డబ్బు తీసుకుని ఓటు వేయాలని అడుగుతున్నారని నాకు కాల్స్ వస్తున్నాయి’ అని తెలిపారు.