బాపట్ల: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాపట్ల అంబేద్కర్ భవన్లో శుక్రవారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలెక్టర్ వెంకట మురళి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటబిడ్డలను చదివిద్దాం అనే నినాదంతో జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. స్కూల్ డ్రాప్ అవుట్ లేకుండా చేయటంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.