కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి నేడు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విచ్చేయుచున్నట్లు ఒంటిమిట్ట ఆలయ టీటీడీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా జేఈవో కళ్యాణ వేదిక వద్ద అసంపూర్ణంగా ఉన్న హైలెవెల్ నీటి ట్యాంకును పరిశీలించి, నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఒంటిమిట్ట రామాలయానికి విచ్చేయునున్న భక్తులకు ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు.