నిజామాబాద్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్సాపల్లిలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతిచెందారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్సాపల్లి నుంచి మిర్దాపల్లికి ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఓ మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.