KNR: భగత్ నగర్ మంచి నీటి రిజర్వాయర్ పైపులైన్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసి డివిజన్లకు యథావిధిగా తాగు నీరు సరఫరా చేస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం రిజర్వాయర్కు తాగు నీరు సరఫరా అయ్యే హెచ్డీపీఏ పైపులైన్ పగిలిపోవడంతో, మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. వేగవంతంగా పనులు చేపట్టి నీరదిస్తామని హామీ ఇచ్చారు.