సిద్దిపేట: జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్లో వినియోగదారుల అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ తనుజ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈనెల 15న సేవా రత్న జాతీయ అవార్డు కుంభాల రవి, జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత గుర్రాల శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు.