కడప: తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో ధనుర్భాసం తిరుప్పావై ప్రవచనాలు డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య తెలిపారు. సోమవారం ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు ధనుర్భాస తిరుప్పావై నిర్వహించారు.