బాపట్ల: నిజాంపట్నం మండలంలో మంగళవారం విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్నామని సోమవారం సాయంత్రం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయ శ్రీనివాస్ తెలిపారు. 132KV రేపల్లె విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల నిమిత్తం 8AM నుంచి 2 PM వరకు నిజంపట్నంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన తెలిపారు. వినియోగదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.