కృష్ణా: గంపలగూడెం మండలం పెనుగలను గ్రామంలో ఉన్న దళితుల శ్మశాన వాటిక పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ లలిత కుమారి తెలిపారు. దీర్ఘకాలికంగా కంప చెట్లు పెరిగి మృతదేహాలను తరలించేందుకు సైతం అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పునరుద్ధరించకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ పనులు చేపట్టినట్లు వివరించారు.