VSP: భీమునిపట్నం జిల్లా విద్యా శిక్షణ సంస్థలో శనివారం గురజాడ అప్పారావు 163వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతికుమారి మాట్లాడుతూ తెలుగుజాతికి, తెలుగు భాషకు గురజాడ అప్పారావు చేసిన సేవలు ఎనలేనివన్నారు.