NLR: కావలి రూరల్ మండలంలోని నడింపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి నేతలు నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ.. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జనార్ధన్, నేతలు తదితరులు పాల్గొన్నారు.