E.G: బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక” కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఉపాధి హామీ పథకం అమలులో ఎటువంటి అక్రమాలు జరిగిన సహించేది లేదని హెచ్చరించారు.