E.G: రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన నగదు చెక్కులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాల వలన ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఈ ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు.