కోనసీమ: ఉచిత ఇసుక విధానంపై అధికారులంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన శనివారం ఇసుక బుకింగ్ ఆన్లైన్ పోర్టల్ విధానంపై అధికారులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇసుక ర్యాంపుల నిర్వహణ ఉండాలన్నారు.