పల్నాడులోని అటవీ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన విషయంలో అటవీశాఖ అనుమతి కోసం సంబంధిత శాఖలు డీజీపీఎస్ సర్వే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో అటవీ ప్రాంతాలలో రోడ్లు, విద్యుత్ సరఫరా లైన్ల్, తాగునీటి సరఫరా, పైపులైన్ల వంటి కార్యక్రమాలకు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవడంపై అధికారులకు సహకరించాలని ఆదేశించారు.