VZM: రామభద్రపురం మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా బుధవారం ఆలయ అర్చకులు సురేష్ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పాలు, పెరుగు, తేనె,నెయ్యి పంచదార తో అభిషేకం చేశారు. భక్తులు తెచ్చిన వివిధరకాల పుష్పాలతో స్వామి వారిని అలంకరించి తీర్ధ ప్రసాదాలు పంచి పెట్టారు.