PDPL: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ గుర్తింపు నుంచి ప్రసూతి వరకు వైద్యం పొందేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, టీకాలు 100% జరిగేలా చూసి, ఆర్బీఎస్కే బృందాల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.