NLG: రంగారెడ్డి జిల్లా వైద్య శాఖలో పిహెచ్ఎస్గా పని చేస్తున్న వలిశెట్టి పద్మశ్రీ మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం పద్మశ్రీ మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.