SRPT: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు శనివారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీడీలు వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు.