BHPL: రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కొయిల క్రాంతి మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల BRS పాలనలో ఆర్టీసీ నాశనమైందని, ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు, 2.5% DA పెంచి, ఫ్రీ బస్సుతో మహిళల జీవితాలను మెరుగుపరిచి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోందని ఆయన అన్నారు.