MDK: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, VHPS మెదక్ కోఆర్డినేటర్ దండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు 100% ఉచిత ప్రయాణం ఇచ్చి, వికలాంగులకు 50% రాయితీ మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం హామీ నిలబెట్టకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు నష్టం తప్పదని హెచ్చరించారు.