SRCL: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, చిక్కుడువానిపల్లి, అనంతారం, ముస్కానిపేట, గాలిపెల్లి, పొత్తూరు గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.