HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలోని శివాలయం ప్రాంగణములో గల శ్రీ గణేశ ఆలయంలో ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించనున్నారు. సంకటహర చతుర్ధి సందర్భంగా గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నట్లు, ఆలయ కార్య నిర్వహణ అధికారి పార్థ సారధి ఒక ప్రకటనలో తెలియజేశారు. భక్తులు పాల్గొని, గణపతి కృపను పొందగలరని కోరారు.